ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు ఎక్కువగా డబ్బుతోనే పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా కొంతమంది యువకులు పెళ్ళిలో తాము చేసుకోబేయేటువంటి వధువుకు గాకుండా కట్నకానుకలకె ఎక్కువ విలువిస్తున్నారు.
కాగా తాజాగా ఓ యువకుడు వధువు తరుపు బంధువులు ఇవ్వాల్సినటువంటి కట్నం డబ్బులో కొంతమేర తగ్గడంతో మళ్లీ సర్దుబాటు చేస్తామని చెప్పినా వినకుండా ఏకంగా పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
స్థానిక రాష్ట్రానికి చెందిన పంచశీల అనే ప్రాంతంలో రామ్ మోహన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.
ఇటీవలే రామ్ మోహన్ తన తనయుడికి ఇదే జిల్లాకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించాడు.కాగా రామ్ మోహన్ కొడుకు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానిక ప్రాంతంలో ఓ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు.
ఇటీవలే పంచశీల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో వీరిద్దరి పెళ్లి వేడుకలు నిర్వహించాలని ఇరువురి కుటుంభం సభ్యులు నిశ్చయించుకున్నారు. అయితే ఇందులో పెళ్లి రోజున వధువు తరపు బంధువులు ఇవ్వాల్సిన కట్నకానుకల విషయంలో కొంతమేర తేడా రావడంతో బంధువుల మధ్య వాగ్వాదం ఏర్పడింది.
దీంతో వరుడు ఏకంగా పెళ్లి మండపం నుంచి పరారయ్యాడు.
దీంతో వధువు తరుపు బంధువులు వధువు ని వెంటబెట్టుకుని దగ్గర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి వరుడిపై ఫిర్యాదు నమోదు చేశారు.
అంతేగాక కట్నం ఇవ్వలేదని పెళ్లి మంటపం నుంచి వెళ్ళిపోయినటువంటి వరుడిపై కఠిన చర్యలు తీసుకుని వధువుకి న్యాయం చెయ్యాలంటూ పోలీసులను కోరుతున్నారు.
.