ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.అక్కడ నిత్యం వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులతో శుభకార్యాలకు అనుమతి లభించింది.దీంతో చాల మంది ప్రభుత్వం అధికారుల అనుమతితో 40 మంది సమక్షంలో వివాహ శుభకార్యాలు జరిపిస్తున్నారు.
ఎన్ని జాగ్రత్తలు వచ్చిన కరోనా మాత్రం ఎదో ఒక్క రూపంలో వెంటాడుతూనే ఉంది.అయితే తాజాగా పెళ్ళి కొడుకు చేసిన పనికి 500 మంది టెన్షన్ లో పడ్డారు.
ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
విశాఖ జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడికి చెందిన యువకుడు పెళ్లి నిశ్చయం అయ్యింది.అయితే వరుడు హైదరాబాద్ శివారులో ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే అతని పెళ్లి తేదీ దగ్గర పడడంతో స్వగ్రామాని వచ్చాడు.పెళ్లి కొడుకుకి కరోనా లక్షణాలు కనపడంతో స్థానిక ఆసుపత్రిలో నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.
అయితే నిర్దారణ పరీక్షల రిపోర్ట్స్ ఇక రాక ముందే యువకుడు వివాహం చేసుకున్నాడు.అయితే నిర్దారణ పరీక్షలో ఆదివారం యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
విషయం తెలుసుకున్న బంధువులు, చుట్టుప్రక్కల వారు షాక్ కి గురైయ్యారు.