జీవితాంతం కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటాను.నీ చేతిని ఎన్నడూ వీడను అని ప్రమాణం చేసి అందుకోవలసిన చేతిని.
ఇటీవల యువకులు అకారణంగా రీజన్స్ చెప్పి.పప్పులోప్ ఉప్పు తక్కువైందనో.
లేదా.ఊరికి రోడ్డులేదనో ఇలాంటి సీల్లీ రీజన్స్ తో పెళ్లి వరకూ వెళ్ళి పెళ్లి కొడుకులు పెళ్లి మానేస్తున్నారు.
కాగా ఇప్పుడు ఓ పెళ్లి కొడుకు తను తినడానికి రసం పెళ్లి కూతురు వారు వెయ్యలేదని తెల్లవారితే పెళ్లి అనగా పెళ్లి మానేసి వెళ్ళి పోయాడు ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.
వివరాల్లోకి వెళ్తే… కర్ణాటక లోని తుమకూరు జిల్లా కుణిగల్కు చెందిన కేపీ సౌమ్యకు శ్రీరామపురకు చెందిన రాజుతో ఆదివారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది.దీంతో మగ పెళ్లి వారు శనివారం రాత్రి ఆలస్యంగా 11.30గంటలకు కళ్యాణమండపానికి చేరుకున్నారు.ఆ సమయంలో మగ పెళ్లి బంధుగణం తమకు భోజనం పెట్టాలని భోజనానికి కూర్చున్నారు.రసం వడించమని వరుడి తల్లి కోరింది.అప్పటికే రసం అయిపోయిందని అమ్మాయి తరుపు వారు చెప్పారు.దీంతో పెళ్లి కొడుకుకి అతని తల్లి కి కోపం వచ్చి పెళ్లి కూతురు ఫ్యామిలీని దూషించడం మొదలు పెట్టారు.
పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెద్దలు ఎంత సర్ధి చెప్పినా వినలేదు.సరికదా ఉదయం 6 గంటలకు వరుడు తన కుటుంబం తో సహా కళ్యాణమండపం నుంచి వెళ్లిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న వదువు తల్లిదండ్రులు పెళ్లి ఆగిపోయిందని బాధపడుతుండగా… గోవిందరాజు అనే యువకుడు పెళ్లి కూతురు సౌమ్యను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు.దీంతో అక్కడ పెద్దలు వీరి వివాహాన్ని జరిపించారు.
ఈ సంఘటన చూసిన వారందరూ రసం కోసం పెళ్లి చేసుకోకుండా వెళ్లి పోతాడా అని వరుడిపై కేసు పెట్టారు.