అమెరికాలో ఉన్న ఇండో అమెరికన్స్ లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న రాజా కృష్ణ మూర్తి అమెరికా కాంగ్రెస్ సభ్యునిగా ఎన్నికైన విషయం విధితమే.అయితే ఆయన ఎంపిక తరువాత మొదటి సారి డల్లాస్ కు వచ్చిన సందర్భంగా రాజా కృష్ణమూర్తికి ప్రవాసభారతీయులు ఘన స్వాగతం పలికారు.
ఆయన గెలుపు కోసం పాల్ పాండియన్, డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఎంఎల్ ప్రసాద్, సీసీ థియోఫిస్, శ్రీధర్ తుమ్మల వంటి వారు కమిటీగా ఏర్పడి ఆయన విజయం కోసం భారీ విరాళాలు సేకరించారు.
రాజాను ఆహ్వానించి విజయోత్సవ సభ నిర్వహించిన సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర సభకు పరిచయం రాజాని చేశారు.
ప్రవాస భారతీయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో రాజా కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు.యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉంటూ విద్య, ఉద్యోగుల కంటే పర్యవేక్షణ ప్రభుత్వ సంస్కరణలు, కమిటీల్లో కీలక సభ్యుడిగా ఉన్నారని తెలిపారు.
అంతేకాదు “ఒబామా కేర్” యాక్ట్ రద్దుకు ఉపక్రమించడం, ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులను అమెరికాలోకి నిషేధం విధించడం వంటి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని రాజా తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు.ప్రవాసుల మద్దతు ఇలాగే ఉంటే అమెరికాలో అయన తిరుగులేని రాజకీయ శక్తిగా మారుతారని తోటకూర ప్రసాద్ తెలిపారు.