హైదరాబాద్ పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.ఈ నర్సరీ మేళా ఈనెల 22 వరకు జరగనుందని ఆయన తెలిపారు.
వివిధ రాష్ట్రాల నుంచి 120కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అదేవిధంగా స్టాల్స్ లో వందకు పైగా అరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాలు ప్రదర్శిస్తూ.
విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామాల్లో హరితహారం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, పల్లె ప్రకృతి వనాలు ప్రారంభం అయ్యాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.చెట్ల పెంపకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.85 శాతం మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 31.6 శాతం గ్రీనరీ పెరిగిందని స్పష్టం చేశారు.