ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి తొందరపాటు నిర్ణయంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు మనం ఎన్నో గమనిస్తూనే ఉంటాం.అలాంటి చిన్న విషయానికే 75 సంవత్సరాల వృద్ధురాలు యాసిడ్ తాగిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఇలా యాసిడ్ తాగడానికి గల కారణం ఏమిటో అర్థంకాక ముందుగా చాలా కంగారు పడ్డారు ఇంటి సభ్యులు.కానీ, ఆ బామ్మ ను 5 సంవత్సరాలు గల మనవరాలు కారణం తెలిసి తెలియక అన్న మాటలకు ఆ ముసలావిడ మనస్థాపానికి గురై తాగిందని కుటుంబసభ్యులు తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని మంత్రి నగర్ లోని 75 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలు కొడుకు కైలాష్ కుటుంబంతో కలిసి తన జీవితాన్ని కొనసాగిస్తోంది.
కొడుకుకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు.వారి ఇంటి పెరట్లో ఒక జామ చెట్టుకు జామకాయలు బాగా విరగకాశాయి.వాటిలో కొన్ని పండ్లు బాగా పండిపోయి ఉన్నాయి .అయితే ఇది ఇలా ఉండగా ఆ ముసలావిడ ఏదో తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆ విషయాన్ని గుర్తించిన కొడుకు వెంటనే ఆవిడను దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించాడు.చికిత్స అందచేసిన డాక్టర్లు ఆమె యాసిడ్ తాగిందని తెలపడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.చికిత్స అందజేసే తరుణంలో ఆమె పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే మీరాబయి కన్ను మూసారు.
ఈ సంఘటనపై విచారణ మొదలు పెట్టిన పోలీసు అధికారులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.దీనితో కైలాష్ కూతురు “మన జామ చెట్టు మీద ఉన్న జామ పండ్లు అన్నీ కూడా నానమ్మ తినేసింది” అంటూ తన తల్లితో చెప్పింది.దీనితో ఆ పాప తెలిసి తెలియక అన్న మాటలకు ఆ ముసలావిడ మనస్థాపానికి గురై తాగిందని తెలియజేశారు.ఇది ఇలా ఉండగా.మరోవైపు మా అమ్మ తాగింది ఏంటో కూడా తెలియదని.డాక్టర్లు చెబితేనే మా అమ్మ తాగింది యాసిడ్ అన్న విషయం మాకు తెలిసింది అంటూ కొడుకు కైలాష్ పోలీసులకు తెలియజేశాడు.