తమిళనాడులో త్వరలో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న అధికార, ప్రతి పక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా ఉన్నాయి.
బిజేపి కూడా తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తుంది.అందుకు మంచి ఇమేజ్ ఉన్న నాయకులను, సినిమా వాళ్ళను తమ పార్టీలో చేర్చుకుంటుంది.
ఈ నేపథ్యంలో కమల్ మాజీ జీవిత భాగస్వామి గౌతమి బిజేపి తరుపున ప్రచారం చేస్తుంది.ఆమె విరుదునగర్ దక్షిణ జిల్లా నేతలు శ్రీవల్లిపుత్తూర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొన్నది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాబోను, పార్టీ పెట్టేది లేదు అంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై గౌతమి, రజినీకాంత్ ను వచ్చే ఎన్నికల్లో బిజేపి కి సపోర్ట్ ఇవ్వాలని కోరింది.ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బిజేపి బలోపేతం అవ్వుతుందని, బిజేపి కి మద్దతు ఇచ్చే విషయంలో రజినీకాంత్ మరోసారి ఆలోచించాలని పేర్కొన్నది.అలాగే రాజ్యపాళ్యం నియోజకవర్గం నుండి పోటీచేసే విషయంపై ఇంకా స్పష్టత లేదు అని తెలిపింది.
ప్రస్తుతం పార్టీ ప్రచార కార్యక్రమాలు మాత్రమే చూసుకుంటున్నాను అని తెలిపింది.పేద్ద మారియమ్మన్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసింది.