ఏ దేశంలో అయినా సరే, ఎవరికైనా సరే వేరే దేశానికి వెళ్లాలంటే కచ్చితంగా పాస్ పోర్ట్ అవసరం.పాస్ పోర్ట్ అనేది ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని పూర్తిగా తెలియజేస్తుంది.
అయితే ఇందుకు అప్లై చేసుకోవడానికి ఇది వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది.ఇకపోతే ప్రస్తుతం ఎవరైనా ఈ కరోనా సమయంలో పాస్ పోర్ట్ కు అప్లై చేయాలని భావిస్తున్నారా.? అయితే ఇకపై మీకు కేవలం ఇ- పాస్ పోర్టు మాత్రమే లభిస్తాయి.ఇది వరకు ఎవరికైనా పాస్ పోర్ట్ వచ్చిందంటే ప్రింట్ చేసి పుస్తకరూపంలో ఇచ్చేవారు.
ఇకపోతే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మైక్రోప్రాసెసర్ చిప్ ఉన్న ఇ- పాస్ పోర్టులను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఇదివరకే కేంద్ర ప్రభుత్వం 20 వేలకు పైగా కొంతమంది అఫీషియల్ కు వీటిని అందజేసింది కూడా.
అయితే ఇంతవరకు కేవలం పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇకముందు దేశంలోని పౌరులందరికీ అందజేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.అయితే ఇందుకు సంబంధించి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పలు ఏజెన్సీలతో చర్చలు జరుపుతోంది.
ఆ తర్వాత దేశంలో ఉన్న పాస్ పోర్ట్ ఆఫీసులో ఈ ప్రక్రియ యంత్రాలను ఏర్పాటు చేసి సేవలు అందించబోతున్నారు.వీటి సహాయంతో ఏకంగా ఒక గంటకు 10 నుంచి 20 వేల పాస్ పోర్ట్ లను జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ప్రక్రియ విజయవంతమైతే పాస్ పోర్ట్ కావాలనుకునే వారికి అతి సులువుగా లభించదు పోతుంది.
ఇందువల్ల ఎవరైనా వారి పాస్ పోర్ట్ లను పోగొట్టుకున్న ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.అయితే ఇ- పాస్ పోర్టులు కేవలం కొత్త వారికి మాత్రమే కాదు, ఎవరైనా రెన్యువల్ చేసుకునేవారు కూడా ఈ అవకాశం లభిస్తోంది.ఇందుకు సంబంధించిన ప్రక్రియ అతి త్వరలో మొదలు కాబోతోంది.