కరోనా టైం లో బాలీవుడ్ లో వరుసగా ఏవో ఒక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఇప్పటికే బాలీవుడ్ లో పలు అనుకోని ఘటనలు చోటుచేసుకున్న విషయం విదితమే.
అయితే తాజాగా బాలీవుడ్లో యాక్షన్ హీరోగా ప్రవేశించి.ఆ తర్వాత కామెడీ సూపర్ స్టార్గా ఓ వెలుగు వెలిగిన హీరో కుమారుడికి యాక్సిడెంట్ అయ్యినట్లు తెలుస్తుంది.
అయితే అదృష్టం కొద్ది ఎలాంటి గాయాలు కానట్లు తెలుస్తుంది.ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే గోవిందా .ఒకప్పుడు బాలీవుడ్ లో గోవిందా సినిమా లు అనగానే అందరూ ఎగబడి చూసేవారు.ఆయన డ్యాన్స్,కామెడీ కి హీరో లు సైతం ఫిదా అయ్యేవారు.
అయితే గత కొన్నేళ్లుగా ఇతను హీరోగా ఫామ్లో లేడు.కానీ ఒకప్పుడు ఈయన సినిమాలు వచ్చాయంటే మిగతా హీరోలకు భయం పట్టుకునేది.
ముఖ్యంగా యాక్షన్తో పాటు కామెడీతో ప్రేక్షకులను నవ్వించడంలో బాలీవుడ్లో గోవిందా తర్వాతే ఇంకెవరైనా అనే చెప్పాలి.ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలకు కూడా గోవిందా చేసే కామెడీ అంటే ఇష్టమని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా.
అయితే ఈయనకు ఓ కుమార్తె టీనా, కుమారుడు యశ్వర్ధన్ ఉన్నారు.అయితే రీసెంట్గా ఈయన కుమారుడు యశ్వర్ధన్ ప్రయాణిస్తోన్న కారు ఇటీవలే ముంబైలోని జుహు ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.
అయితే ఈ నెల 2 వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అయితే యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో యశ్వర్ధన్తో పాటు అతని కారు డ్రైవర్ కూడా ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
2 వ తేది రాత్రి యశ్వర్ధన్ తనకు తెలసిన వాళ్లకు సంబంధించిన ఓ పార్టీ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా జుహు వద్ద యశ్ రాజ్ ఫిల్మ్స్కు చెందిని ఫ్యార్చూన్ కారు.వీళ్ల కారు ఢీకొట్టుకున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడం తో ఇరు వర్గాలు ఒకరికొకరు చర్చించుకొని వాళ్ల ప్రాబ్లెమ్ను వాళ్లే సాల్వ్ చేసుకున్నారు.దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేయకపోవడం తో ఈ విషయం బయటకు రాలేదు.
ప్రస్తుతం గోవిందా పలు టీవీ రియాలిటీ షోలకు జడ్డ్గా వ్యవహిస్తున్న విషయం విదితమే.