నిమ్మగడ్డ కి ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ రాష్ట్ర గవర్నర్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ రోజుతో ముగియనుంది.ఈ క్రమంలో గవర్నర్ ని కలవాలని నిమ్మగడ్డ అపాయింట్మెంట్ నాలుగు రోజుల క్రితమే కోరగా, నిమ్మగడ్డ ని కలవటానికి గవర్నర్ ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం.

 Governor Gave Shock To Nimmagadda Nimmagadda, Andhra Pradesh, Neelam Sahni, Ap G-TeluguStop.com

ఈ రోజు చివరి రోజు కావడంతో గవర్నర్ నుండి ఎటువంటి సమాచారం అయినా వస్తుందని భావించిన నిమ్మగడ్డ కి ఎలాంటి సమాచారం రాకపోవటంతో నిమ్మగడ్డ తీవ్ర నిరాశకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇదే నెలలో 19 వ తారీకు తనని కలవాలని గవర్నర్ నిమ్మగడ్డ కు సమాచారం అందించిన క్రమంలో, ఆ టైంలో నేను హైదరాబాదులో ఉంటాను అంటూ కలవలేను అని నిమ్మగడ్డ నుండి ప్రతి స్పందన రావడం జరిగిందట.

కాగా నేడు నిమ్మగడ్డ పదవి కాలం చివరి రోజు కావటంతో గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం గమనార్హం.ఇదిలా ఉంటే ఇదే రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఏదిఏమైనా గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం నిమ్మగడ్డ కి పెద్ద షాక్ ఇచ్చినట్లు అయ్యింది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube