ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ రోజుతో ముగియనుంది.ఈ క్రమంలో గవర్నర్ ని కలవాలని నిమ్మగడ్డ అపాయింట్మెంట్ నాలుగు రోజుల క్రితమే కోరగా, నిమ్మగడ్డ ని కలవటానికి గవర్నర్ ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం.
ఈ రోజు చివరి రోజు కావడంతో గవర్నర్ నుండి ఎటువంటి సమాచారం అయినా వస్తుందని భావించిన నిమ్మగడ్డ కి ఎలాంటి సమాచారం రాకపోవటంతో నిమ్మగడ్డ తీవ్ర నిరాశకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇదే నెలలో 19 వ తారీకు తనని కలవాలని గవర్నర్ నిమ్మగడ్డ కు సమాచారం అందించిన క్రమంలో, ఆ టైంలో నేను హైదరాబాదులో ఉంటాను అంటూ కలవలేను అని నిమ్మగడ్డ నుండి ప్రతి స్పందన రావడం జరిగిందట.
కాగా నేడు నిమ్మగడ్డ పదవి కాలం చివరి రోజు కావటంతో గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం గమనార్హం.ఇదిలా ఉంటే ఇదే రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఏదిఏమైనా గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం నిమ్మగడ్డ కి పెద్ద షాక్ ఇచ్చినట్లు అయ్యింది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి.