ఏపీ గవర్నర్ గా ఇటీవల విశ్వభూషణ్ హరి చందన్ ప్రమాణ స్వీకారం చేసి భాద్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.అయితే ఏపీ గవర్నర్ హోదా లో ఆయన తన తోలి పుట్టిన రోజు వేడుకలను రాజ్ భవన్ లో జరుపుకోనున్నారు.
ఆయన తన 85 వ పుట్టిన రోజు వేడుకలను గిరిజన,దళిత చిన్నారుల మధ్య జరుపుకోనున్నారు.ఈ వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు కొడాలి నాని,వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలపనున్నారు.తొలుత రాజ్ భవన్ లో ఉదయాన్నే ఆయనకు తిరుమల తిరుపతి, కనకదుర్గమ్మ దేవస్థానాల వేదపండితులు ఆశీర్వచనం ఇస్తారు.
అనంతరం కేక్ కట్ చేసి, చిన్నారులందరికీ నూతన వస్ర్తాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తారు.
చివరగా ఆంధ్రా లయోలా కళాశాలలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు కూడా నాటనున్నట్లు తెలుస్తుంది.ఏపీ గవర్నర్ హోదాలో హరిచందన్ తోలి పుట్టిన రోజు వేడుకలు రాజ్ భవన్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.అయితే ఆయన తన పుట్టిన రోజు వేడుకలను గిరిజన,దళిత చిన్నారుల మధ్య జరుపుకుంటుండడం విశేషం.