జగన్ కి ఇష్టమైన ప్రోగ్రాం ని కాపీ కొడుతున్న కేరళ సర్కారు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలలో పేద వాళ్ళ జీవితాలలో చాలా మార్పులు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో జగన్ అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకోవటం జరిగింది.

 Ys Jagan , Kerala Govt, Naadu Nedu Programme, Kerala Govt Copied Ys Jagan Progra-TeluguStop.com

ముఖ్యంగా “నాడు నేడు” కార్యక్రమాన్ని జగన్ సర్కార్ ఎంత ఇష్టపూర్వకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ ఆసుపత్రులు మరియు పాఠశాలల రూపురేఖలను మారుస్తూ అనేక సదుపాయాలను కల్పిస్తున్నారు.

నాడు నేడు కింద జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలల లుక్కు తీసుకురావటం తెలిసిందే.ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో కేంద్ర పరిధిలో నడిచే పాఠశాలలు రూపురేఖలను మార్చటానికి రెడీ అయినట్లు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలపడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా ఇదే నాడు నేడు ప్రోగ్రాం నీ కాపీ కొడుతూ కేరళ సర్కార్.కూడా సరి కొత్త నిర్ణయాలు తీసుకుంది.

మేటర్ లోకి వెళ్తే కేరళ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడిచే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించే విధంగా “నాడు-నేడు” పథకం తరహాలో అక్కడి ప్రభుత్వం పనులు స్టార్ట్ చేయడం జరిగింది.దీంతో ఈ వార్త తెలుసుకుని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు జగన్ రెండు సంవత్సరాల పరిపాలన కె ఆయన నిర్ణయాలు అంతగా ప్రభావితం చేస్తే రాబోయే రోజుల్లో జగన్ మరింతగా దేశంలో చాలా మందికి ఆదర్శంగా నిలబడతారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube