తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.దాదాపు మూడు లక్షల కోట్లతో రూపొందించిన వార్షిక బడ్జెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు.ఈ క్రమంలో రైతుల కోసం రుణమాఫీ కోసం రూ.6,385 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.వ్యవసాయ శాఖకు కేటాయించిన రూ.26,931 కోట్లతో పాటు రుణమాఫీ కోసం ప్రత్యేక కేటాయింపులు చేసింది ప్రభుత్వం.దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు