ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ధరలు దోచుకున్న ప్రైవేటు ఆసుపత్రులపై భారీ జరిమానాలు విధిస్తుంది.మహమ్మారి కరోనా వైరస్ ట్రీట్ మెంట్ విషయంలో ప్రజల వద్ద అడ్డంగా దోచుకుంటున్న ఆసుపత్రులను గుర్తించి మొదటి లో నోటీసు.
ఆ తరువాత కూడా అదే తప్పు హాస్పిటల్ యజమాన్యం రిపీట్ చేస్తే ప్రభుత్వం భారీగా జరిమానాలు విధిస్తుంది.ఇలాంటి తరుణంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ హాస్పిటల్స్ కి మూడు రోజుల్లో జరిమానాలు కట్టాలని.
కొరడా ఝుళిపించింది ప్రభుత్వం.
ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు అందించడం జరిగింది.
అంతేకాకుండా ఇప్పటికే ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు పై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు కావడం జరిగింది. రేమిదిసివర్ ఇంజక్షన్ అక్రమ వినియోగం అవసరం లేకుండా బెడ్ లు ఏర్పాటు చేసుకోవడం ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా గాని సదరు పేషంట్ దగ్గర అడ్వాన్స్ కట్టించుకోవడం వంటి పనులకు పాల్పడటం తో ప్రభుత్వం సీరియస్ అయి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులకు ఊహించని రీతిలో.
భారీ జరిమానా విధిస్తూ మూడు రోజుల్లో కట్టాలని డెడ్ లైన్లు పెట్టడం జరిగింది.దీనిలో భాగంగా చిత్తూరు జిల్లాలో మూడు ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు అందించడం జరిగింది.