టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా హీరోయిన్ సాయిపల్లవికి ఉండే క్రేజ్ వేరు.ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సాయిపల్లవి వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.
తెలుగు, తమిళ భాషల్లో పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తున్న సాయిపల్లవి గత రెండేళ్లలో నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు.అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సాయిపల్లవికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.
అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పారితోషికం విషయంలో చూసీచూడనట్లు వ్యవరించిన సాయిపల్లవి ప్రస్తుతం నిర్మాతల నుంచి భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సాయిపల్లవి ఏకంగా కోటిన్నర రూపాయలు ఒక్కో సినిమాకు డిమాండ్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే సాయిపల్లవి క్రేజ్ పెరిగినా రెమ్యునరేషన్ విషయంలో పట్టింపులకు పోదని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు.
చిన్న వయస్సులోనే నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సాయిపల్లవి తెలుగుతో పాటు ఇతర భాషల్లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ధనుష్ తో కలిసి సాయిపల్లవి నటించిన మారి 2 సినిమాలోని రౌడీ బేబీ పాట 103 కోట్ల వ్యూస్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించడంతో పాటు డ్యాన్సులు బాగా చేస్తుందని సాయిపల్లవికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.
సాయిపల్లవి నటించిన పావ కథైగాల్ తమిళంలో నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 18వ తేదీన విడుదల కాగా ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది.ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటిస్తున్నారు.
ఆమె నటిస్తున్న ఒక్క సినిమా హిట్ అయినా పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.