తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ శాసనసభ స్థానం నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీలో నిలబడిన చంద్రముఖి అనే ట్రాన్స్ జెండర్ రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయ్యింది అంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి.దీనిపై మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
అంతేకాకుండా బీఎల్ఎఫ్ నేతలు, హిజ్రాలు, ప్రజా సంఘాలు పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించి తమ నిరసనలు వ్యక్తం చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగి, సీసీ కెమెరా ఫుటేజీ మరియు ఫోన్ కాల్స్ ఆధారంగా తమ దర్యాప్తుని ముమ్మరం చేసారు.
నిన్న బుధవారం చంద్రముఖి ఆచూకీని ఇందిరా నగర్ లో ఆమె ఆచూకి తెలుసుకున్నారు.అయితే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలనే ఆలోచనతో ఆమె కిడ్నాప్ డ్రామా ఆడినట్టు తెలుస్తోంది.ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా… చంద్రముఖి తన సహచర ట్రాన్సజెండర్లతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది.
తనని న్యాయస్థానంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే ఆమె మాత్రం ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించి, కిడ్నాప్ చేసి, విజయవాడ తీసుకెళ్లి, అక్కడి నుండి చెన్నై కి తరలించాలని చూసారని తాను తప్పించుకుని వచ్చేశానని ఆమె చెప్తోంది.