ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో వైసీపీ అధిక స్థానాలు గెలవటం తెలిసిందే.ఏకంగా చంద్రబాబు నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలవడంతో.
ఏపీలో టీడీపీ పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చిందని వైసీపీ నేతలు భారీ డైలాగులు వేస్తున్నారు.ఇటువంటి తరుణంలో లో వైసీపీ గెలుపుపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.అసలు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అప్పుడే బహిష్కరించింది అని కౌంటర్ ఇచ్చారు.” ఊహించని గెలుపునకు బాజాలు.అవి ఎలక్షన్స్ కాదు సెలక్షన్స్ ప్రజాస్వామ్యం హరించి గెలిచారు.
కేవలం నామమాత్రంగా మాత్రమే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందని బహిష్కరణ చేసిన ఎన్నికల్లో.
తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి ఏంటి అంటూ.మండిపడ్డారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
ఇదే రీతిలో మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు పరిషత్ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని అందువల్లే వైసీపీ గెలిచిందని.టీడీపీ ముందుగానే ఊహించింది అన్న రీతిలో కామెంట్ చేస్తూ ఉన్నారు.
ఏదిఏమైనా ఏపీలో పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలవడం.ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈ గెలుపుతో వైసీపీ నేతలు టిడిపి పని ఏపీలో కూడా అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.