దర్శకుడు తేజ కొన్ని నెలల క్రితం రెండు చిత్రాలను ప్రకటించాడు.ఆ రెండు చిత్రాల్లో అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇది లేడీ ఓరియంటెడ్ చిత్రం అంటూ కొందరు అనుకున్నారు.హీరోగా గోపీచంద్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కీర్తి సురేష్ను ఈ చిత్రం కోసం తేజ సంప్రదించాడనే ప్రచారం కూడా జరిగింది.అంతటి చర్చ జరుగుతున్న ఈ చిత్రంపై టైటిల్ అనౌన్స్ మెంట్ తర్వాత ఒక అధికారిక క్లారిటీ రావడంతో ఫ్యాన్స్లో చర్చకు తెర పడ్డట్లయ్యింది.
తాజాగా హీరో గోపీచంద్ ఒకానొక సందర్బంగా మాట్లాడుతూ నాకు నటుడిగా బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తేజ.జయం, నిజం చిత్రాల్లో నటించడం వల్లే తాను ఈస్థాయిలో ఉన్నానని గోపీచంద్ భావిస్తున్నాడు.అందుకే ఆయన దర్శకత్వంలో హీరోగా సినిమా చేయాలనుకున్నాడు.తేజ దర్శకత్వంలో మొదటి సారి హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ గోపీచంద్ అలివేలుమంగ వెంకటరమణ చిత్రం గురించి అధికారిక ప్రకటన చేశాడు.
ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుండి మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.కీర్తి సురేష్ ఈ చిత్రంలో నటిస్తుందా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.తేజ నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో ఫామ్లోకి వచ్చాడు.
కనుక ఈ చిత్రంతో మరో విజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంను సినీ జనాలు మరియు ప్రేక్షకులు కలిగి ఉన్నారు.