మామూలుగా ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఏదైనా రిలేషన్ ఉంటేనే వారి మధ్య గొడవలు, వార్నింగులు ఉంటాయి.మరి ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీనటుల మధ్య కూడా ఇటువంటి వార్నింగ్ లు, గొడవలు ఉంటే వారి మధ్య కూడా రిలేషన్ ఉన్నట్లే.
అయితే ఇదంతా పక్కన పెడితే ఇటువంటి రిలేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క, గోపీచంద్ కు మధ్య కూడా గతంలో ఉందని బాగా టాక్ వినిపించింది.అయితే ఆ రిలేషన్ తోనే అనుష్కకు వార్నింగ్ ఇచ్చాడట గోపీచంద్.
నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఆ తర్వాత వరుసగా వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా నటించింది.
ఇక ఈమె నటించిన అరుంధతి, బాహుబలి, బిల్లా వంటి పలు సినిమాలతో మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.
స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హోదాను సంపాదించుకుంది.
తన అందంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.ఇక మంచి సక్సెస్ లు అందుకున్న అనుష్కకు కొన్ని ఫ్లాపులు కూడా ఎదురయ్యాయి.
అందులో పంచాక్షరి, భాగమతి, సైజ్ జీరో వంటి సినిమాలు తన కెరీర్ కు బాగా దెబ్బతీశాయి.తిరిగి సక్సెస్ లు అందుకోవడానికి బాగా తాపత్రయపడుతోంది.
ఇదిలా ఉంటే గతంలో ఓ సినిమా సమయంలో గోపీచంద్ తనకు గట్టి వార్నింగ్ ఇచ్చాడట.అనుష్క గోపిచంద్ తో కూడా కలిసి పలు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక అనుష్క స్టార్ హోదా ను అందుకోక ముందు స్టార్ హోదా కోసం బాగా ఆరాటపడింది.దాంతో తమిళంలో నయనతార నటించిన సినిమాను తెలుగులో బిల్లా రీమేక్ లో నటించాలని ముందుకు వచ్చింది.
నిజానికి తమిళంలో ఈ సినిమాతో నయనతార బికినీతో చేసిన ఎక్స్ పోజింగ్ వల్ల స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.దాంతో అనుష్క కూడా ఎలాగైనా ఆ సినిమాలో నటించి స్టార్ హోదా ను సంపాదించుకోవాలని ఫిక్స్ అయింది.
అంతేకాకుండా గతంలోని ఈ విషయం గురించి కొన్ని విషయాలు కూడా తెలిపింది.అవకాశం వస్తే బికినీతో నటించడానికి కూడా సిద్ధమే అని తెలిపింది.
దీంతో డైరెక్టర్ ఆమెకు బిల్లా సినిమాలో అవకాశం ఇచ్చాడు.
ఇక ఈ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని తెలియడంతో వెంటనే గోపీచంద్ ఆమెకు ఫోన్ చేసి ఆ సినిమాలో నటించవద్దు అని వార్నింగ్ ఇచ్చాడట.కాని గోపీచంద్ మాటలు కాదని తను ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకొని నటించిందట.ఆ తరువాత గోపీచంద్ తనతో మళ్లీ కాంటాక్ట్ లో లేడని తెలిసింది.
కానీ ఈ సినిమాతోనే అనుష్క కెరీర్ మొత్తం మలుపు తిరిగింది అని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ఇటీవలే నిశ్శబ్దం సినిమాలో నటించగా ఈ సినిమా అంత సక్సెస్ కాలేదు.
ఇక ప్రస్తుతం మళ్ళీ నయనతార బాటనే పట్టినట్లు తెలిసింది.కానీ ఆ సినిమా నయనతారకు అంత హిట్ ఇవ్వలేక పోయింది.
మళ్లీ అనుష్క నయనతార నటించిన తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసింది.ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.