‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ హీరోలను మించి పెరిగి పోయింది.బాహుబలి చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రశంసలు దక్కించుకున్న నేపథ్యంలో ప్రభాస్కు భారీ స్థాయిలో గుర్తింపు దక్కింది.
తెలుగులో ఈయన సినిమాలు చేస్తున్నా కూడా బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.అంతటి క్రేజ్ ఉన్న ప్రభాస్తో సినిమా చేయాలని గోపీచంద్ కోరుకుంటున్నాడు.
అప్పట్లో ఇద్దరం కలిసి చేశాం, మళ్లీ ఇద్దరం కలిసి త్వరలోనే నటిస్తామని ప్రకటించాడు.
‘వర్షం’ చిత్రం ప్రభాస్ కెరీర్ ఆరంభంలో వచ్చిన విషయం తెల్సిందే.ఆ చిత్రంలో గోపీచంద్ విలన్గా నటించాడు.ఆ చిత్రం తర్వాత గోపీచంద్ హీరోగా మారాడు.
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో గోపీచంద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్తో తప్పకుండా భవిష్యత్తులో ఒక సినిమాను చేస్తాను.ఆ సినిమా కోసం మంచి కథ మరియు దర్శకుడు సెట్ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ప్రభాస్, గోపీచంద్లు మంచి మిత్రులు.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభాస్ సినిమాల్లో నటించేంత స్థాయి గోపీచంద్కు లేదని చెప్పాలి.వీరిద్దరు కలిసి నటిస్తే బాక్సాఫీస్ సందడి కనిపించక పోవచ్చు.వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పట్లో సినిమా రాకపోవడమే మంచిదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.గోపీచంద్ చిన్న సక్సెస్ కోసం ఎదురు చూస్తుండగా, ప్రభాస్ మాత్రం వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్తో దూసుకు పోతున్నాడు.ఇలాంటి సమయంలో వీరి కాంబో మూవీ ఎలా వర్కౌట్ అయ్యేను అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.