సినీ ప్రేక్షకులకు హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గోపీచంద్ ప్రస్తుతం నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల సిటీ మార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనివాస్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.దర్శకుడు శ్రీనివాస్ గోపీచంద్ లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలు గోపిచంద్ కు మరింత పేరు తెచ్చిపెట్టాయి.
అదే విధంగా ఈ రెండు సినిమాలు వీరిద్దరికీ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఇది ఇలా ఉంటే వీరిద్దరూ ఇప్పుడు మరొకసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ నెల మూడవ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే.పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఓ పాటను కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇక ప్రస్తుతం చిత్ర బృందం కొంత విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది.విరామం అనంతరం తాజా షెడ్యూల్ ను ఈ నెల 21 నుంచి హైదరాబాదులో ప్రారంభించనున్నారు.
ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు చక్కని సందేశం బలమైన కథతో దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమాలో హీరో గోపీచంద్ను సరికొత్తగా చూడబోతున్నారు అని ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాకు లక్ష్యం 2 అనే టైటిల్ ను పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.మరి టైటిల్ ఏంటి అనేది నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఇందులో నటుడు జగపతిబాబు, సీనియర్ నటి కుష్బూ కీలక పాత్రలో నటిస్తున్నారు.