టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సీటీమార్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
కాగా ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు.
కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ తాజాగా ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమాను చిత్ర యూనిట్ వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
వినయాక చవితి పండుగ సీజన్ రేసులో ఈ సినిమాను రిలీజ్ చేయాలని సంపత్ నంది భావిస్తున్నాడట.దీంతో సెప్టెంబర్ నెలలో సినిమాల రిలీజ్లు ఎక్కువగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి పండగ వాతావరణం నెలకొనడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక సీటీమార్ చిత్రంలో కార్తిక్ సుబ్రహ్మణ్యం అనే మహిళా కబడ్డీ కోచ్గా గోపీచంద్ నటిస్తుండగా, మరో కోచ్ జ్వాలా రెడ్డిగా తమన్నా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా పాటలకు కూడా మంచి స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ అంటోంది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అదనపు బలంగా నిలవనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.మరి పండుగ రేసులో గోపీచంద్ సినిమా ప్రేక్షకులతో సీటీమార్ కొట్టిస్తుందో లేదో చూడాలి.