తెలుగు సినిమా హీరోలలో ఒకరైన గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన “సిటీ మార్” సినిమాలో నటిస్తున్నారు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించనున్నారు.
ఇందులో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా,దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్లుగా సందడి చేయనున్నారు.
ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించగా, తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా సందడి చేయనున్నారు.
ఇకపోతే న్యూస్ రిపోర్టర్ గా దిగంగనా సూర్యవన్షీ కీలక పాత్రలో కనిపించనున్నారు.శ్రీనివాస చిత్తూరు నిర్మాణంలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణం చేత వాయిదా పడింది.
అయితే ప్రస్తుతం థియేటర్లు తెరచుకున్నప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలనే సందిగ్ధంలో చిత్ర నిర్మాతలు ఉన్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారాన్ని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.ఈ క్రమంలోనే శుక్రవారం మీడియాతో మాట్లాడిన చిత్రబృందం ఈ సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చారు.
సిటీ మార్ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా వచ్చేనెల థియేటర్లలోనే విడుదల చేస్తున్నామని చిత్రబృందం అధికారికంగా వెల్లడించారు.