మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా సీటీమార్.సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
సెప్టెంబర్ 10న థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలంగాణాలో 215.ఏపీలో 350 థియేటర్లలో రిలీజ్ అవుతుంది.తెలుగు రెండు రాష్ట్రాల్లో మొత్తం 565 థియేటర్లలో సీటీమార్ సినిమా రానుంది.ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 11.5 కోట్ల దాకా జరిగినట్టు తెలుస్తుంది.కరోనా సెకండ్ వేవ్ తర్వాత హయ్యెస్ట్ బిజినెస్ జరిగిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.
ఇక గోపీచంద్ సీటీమార్ సూపర్ హిట్ అనిపించుకోవాలి అంటే 12 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సీటీమార్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు.
సీటీమార్ ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం 12 కోట్లు తీసుకురావడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు.సంపత్ నందితో గౌతం నంద సినిమా చేసిన గోపీచంద్ సీటీమార్ అంటూ ఓ మాస్ అండ్ పవర్ ఫుల్ స్టోరీతో వస్తున్నారు.
ఈ మూవీపై గోపీచంద్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. తమన్నా గ్లామర్ కూడా సినిమాకు చాలా ప్లస్ అవుతుందని తెలుస్తుంది.సినిమాలో గోపీచంద్, తమన్నాల జోడీ హైలెట్ గా ఉంటుందని టాక్.