గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సిటీమార్ సినిమా ను గత ఏడాది నుండి అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు.గోపీచంద్ కెరీర్ అస్సలే బాగాలేదు అంటున్న ఈ సమయంలో అనూహ్యంగా ఆయన నటించిన సిటీమార్ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు.వచ్చే నెలలో చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
ఈ సమయంలో గోపీచంద్ సిటీ మార్ సినిమాను కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.అందుకు సంబంధించిన అధికారిక ప్రటకన వచ్చేసింది.
సెప్టెంబర్ లో విడుదల చేస్తామంటున్న యూనిట్ సభ్యులు డేట్ విషయంలో వచ్చే వారంలో స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
లవ్ స్టోరీని థియేటర్ల ద్వారా వచ్చే నెలలోనే విడుదల చేసేలా ప్లాన్ చేశారు.
ఇప్పటికే వారు డేట్ ను ఖరారు చేశారు.కనుక తదుపరి వారం లో సిటీమార్ ను విడుదల చేస్తారనే సమాచారం అందుతోంది.
సెప్టెంబర్ లో సినిమాల విడుదల అంత లాభదాయకం కాదని కొందరు అంటున్నారు.
ఎందుకంటే కరోనా కారణంగా జనాలు ఇంకా థియేటర్ల వైపుకు వెళ్లేందుకు భయపడుతున్నారు.ఈ భయం కనీసం మరో అయిదు ఆరు నెలలు ఉంటుంది అంటున్నారు.అందుకే ఈ సమయంలో ఏ సినిమాలు వచ్చినా కూడా సూపర్ హిట్ అయితే జనాలు చూసేందుకు ఆసక్తి చూపించరు.
కనుక సిటీ మార్ సినిమా ఫలితం కాస్త అటు ఇటు అయితే మాత్రం కష్టాలు తప్పవు అంటున్నారు.పరిస్థితి ఎలా ఉన్నా సిటీ మార్ ను వదిలేస్తే ఒక పనై పోతుంది అనేది యూనిట్ సభ్యుల అభిప్రాయంగా తెలుస్తోంది.
అందుకే వచ్చే నెలలో విడుదల చేస్తారని తెలుస్తోంది.