కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీ స్పీడ్ అందుకుంది.వరుస సినిమాలు విడుదల చేస్తూ అన్ని ఇండస్ట్రీల కంటే కాస్త దూకుడుగా ముందుకు పోతుంది.
వరణకు మూడు నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి.అందుకే కొన్ని సినిమాలు అనుకున్న తేదీలకు విడుదల అవ్వకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి.
తమ సినిమాలకు ఎటువంటి పోటీ ఉండకూడదని విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్నారు.
ఇదే కోవలోకి గోపీచంద్ సిటీమార్ సినిమా కూడా చెందుతుంది.
టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న గోపీచంద్ నటించిన సీటిమార్ సినిమా ఏప్రిల్ 2 నవిడుదల కావాల్సి ఉండగా తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.ఇదే రోజున నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాతో పాటు కార్తీ నటించిన సుల్తాన్ సినిమాలు విడుదల అవుతున్నాయి.
అందుకే సిటీమార్ సినిమా వాయిదా వేశారు.ఈ సినిమాను పోటీ లేకుండా రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.అందుకే మరొక డేట్ చూసుకుని సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ సినిమా రూపొందుతుంది.వరుస ప్లాపులతో సతమతమవుతున్నగోపీచంద్ కు ఈ సినిమా కీలకంగా మారింది.
కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ లేడీస్ టీమ్ కోచ్ గా పనిచేస్తున్నాడు.
ఈ సినిమాలో తమన్నా, దిగంగన సూర్య వంశి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో తమన్నా కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలా రెడ్డిగా నటిస్తుంది.ఈ సినిమా ఎమోషన్ తో పాటు థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.గోపీచంద్ ఈ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.