టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల నటిస్తున్న సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోతున్నాయి.దీంతో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సీటీమార్’ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక గోపీచంద్ నటిస్తున్న ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సంపత్ నంది.ఈ సినిమాలో కబడ్డీ కోచ్గా గోపీచంద్ కనిపిస్తున్నాడు.
అయితే ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిజిటల్ ప్రపంచంలో ఇప్పటికే పలువురు స్టార్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా గోపీచంద్ కూడా ఇదే బాటలో పయనించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలోనే ఓ వెబ్ సిరీస్లో నటించాలంటూ ఆఫర్ రావడంతో గోపీచంద్ ఆలోచనలో పడ్డాడట.నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రాజా చెయ్యి వేస్తే చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి, ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
ఈ వెబ్ సిరీస్లో గోపీచంద్ నటిస్తే బాగుంటుందని ఆయన కోరుతున్నాడు.దీనికి సంబంధించిన చర్చలు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుండటంతో ఇందులో గోపీచంద్ నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.అయితే ఈ విషయంపై గోపీచంద్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మరి మిగతా స్టార్స్ లాగా గోపీచంద్ కూడా వెబ్ సిరీస్లో నటిస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.అటు గోపీచంద్ నటిస్తున్న సీటీమార్ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.