యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.విభిన్న చిత్రాల దర్శకుడి గా పేరు సంపాదించిన మారుతి ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు.
ఆయన స్టైల్లోనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పక్కా కమర్షియల్ సినిమా గా ఈ సినిమా ను పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.గోపీచంద్ కు జోడిగా ఈ సినిమా లో రాశి ఖన్నా నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ని బన్నీ వాసు నిర్మించాడు.అల్లు అరవింద్ సమర్పించాడు.
యువి క్రియేషన్స్ వారు వంశీ మరియు ప్రమోద్ లు ఈ సినిమా కి సహా నిర్మాత లుగా వ్యవహరించారు.
ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సాధించలేక పోయింది.రూ.25 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందింది.థియేట్రికల్ రిలీజ్ అయి సక్సెస్ అవ్వలేక పోయినా ఈ సినిమా ను డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు ఆహా మరియు నెట్ఫ్లిక్స్ ఓటీటీ లు తీసుకు వచ్చాయి.
ఈ సినిమా కు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమయింది.ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు గా ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేశారు.
థియేటర్లో చూడని చాలా మంది ఈ సినిమా ని ఓటీటీ ద్వారా చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు గా సమాచారం అందుతోంది.కనుక థియేటర్ ద్వారా దక్కని సక్సెస్ ఈ సినిమా కి డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా దక్కే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటున్నారు.
ఒకేసారి రెండు డిజిటల్ ఓ టీ టీ ల్లో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ఎక్కువ శాతం మంది ఆహా లో చూస్తున్నట్లు తెలుస్తోంది.