టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.కాగా తన కొత్త చిత్రం ‘సీటీమార్’తోనైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమా తరువాత గోపీచంద్ దర్శకుడు తేజ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు.ఈ సినిమాకు ‘అలివేలుమంగ వెంకటరమణ’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని తేజ భావిస్తున్నాడు.కాగా ఈ సినిమా తరువాత గోపీచంద్ మరో సక్సెస్ఫుల్ డైరెక్టర్తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.
ఇటీవల ప్రతిరోజూ పండగే చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మారుతితో గోపీచంద్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఇద్దరు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్తో గోపీచంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.