టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో గోపీచంద్ మలినేని ఒకరనే విషయం తెలిసిందే.క్రాక్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య హీరోగా ఒక సినిమాను తెరకెక్కించనుండగా వచ్చే ఏడాది ఆ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాలయ్య హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
తాజాగా అఖండ ఈవెంట్ కు అతిథిగా హాజరైన గోపీచంద్ మలినేని తాను బాలయ్యకు అభిమానినని వెల్లడించారు.
నందమూరి బాలకృష్ణ అంటే మాస్ గాడ్ అని ఒక వైబ్రేషన్ అని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు.బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రతినిధిగా మీలో ఒకడిగా తాను ఈ ఈవెంట్ కు వచ్చానని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు.
ఒంగోలులో సమరసింహారెడ్డి టికెట్ల కొరకు రెండు రోజులు లాకప్ లో ఉన్నానని గోపీచంద్ మలినేని అన్నారు.
మాస్ పల్స్ తెలిసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అని గోపీచంద్ మలినేని అన్నారు.
సింహా, లెజెండ్ ఏ స్థాయిలో సక్సెస్ సాధించాయో అఖండ కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.థమన్ గత నెలరోజులుగా అఖండ అదిరిపోయిందంటూ ఈ సినిమా పేరునే కలవరిస్తున్నాడని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు.ఎంతటి మాస్ చూపించారో అఖండ టీజర్, ట్రైలర్ రిలీజైన తర్వాత తనకు అర్థమైందని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు.
విలన్ గా శ్రీకాంత్ ను చూసిన తర్వాత అఖండ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు.అఖండ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని తాను కోరుకుంటున్నానని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.