బాలయ్యకి కథ చెప్పడానికి రెడీ అవుతున్న క్రాక్ దర్శకుడు

మాస్, కమర్షియల్ చిత్రాల దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని.ప్రస్తుతం గోపీచంద్ మాస్ రాజా రవితేజతో క్రాక్ సినిమాని తెరకెక్కించారు.

 Gopichand Malineni Ready To Narrate Story To Balakrishna, Tollywood, Telugu Cine-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.సంక్రాంతి ఫెస్టివల్ లేదంటే ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దర్శకుడు పవర్ ఫుల్ మాస్ ఎలిమెంట్ తో ఓ కథని సిద్ధం చేసుకొని మైత్రి మూవీ మేకర్స్ కి వినిపించినట్లు తెలుస్తుంది.ఇక మైత్రీ నిర్మాతలు అతని కథకి ఒకే చెప్పడం జరిగిందని సమాచారం.

అయితే ఈ కథని గోపీచంద్ బాలయ్య బాబు కోసం సిద్ధం చేశారు.మైత్రీ నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకుడు బాలకృష్ణకి కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షెడ్యూల్ ని త్వరలో నంద్యాలలో స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాలో మరోసారి బాలకృష్ణని బోయపాటి డ్యూయల్ రోల్ లో చూపిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుకి సంబంధించి సస్పెన్స్ ఇంకా వీడలేదు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయడానికి పూరి జగన్నాథ్, శ్రీవాస్, కెఎస్ రవికుమార్ సిద్ధంగా ఉన్నారు.వీరితో పాటు ఇప్పుడు గోపీచంద్ కూడా లైన్ లోకి వచ్చాడు.

వీరు మాత్రమే కాకుండా ఓ కొత్త దర్శకుడు కూడా బాలకృష్ణకి కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడు.మరి బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ ఐదు మంది దర్శకులలో ఎవరితో చేస్తాడు అనేది వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube