నందమూరి బాలకృష్ణ కెరీర్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి.కానీ వాటిలో ఎక్కువ శాతం ఫ్యాక్షన్ సినిమాలే ఉన్నాయి.
కానీ ఈ మధ్య బాలయ్య ఫ్యాక్షన్ సినిమాలు చేసి చాలా రోజులు అవుతుంది.మళ్ళీ ఇన్ని రోజులకు ఫ్యాక్షన్ సినిమాతో రాబోతున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ అఖండసినిమా తర్వాత గోపిచంద్ మలినేని తో ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో గోపిచంద్ బాలయ్యను రెండు విభిన్నమైన వేరియేషన్స్ లో చూపించబోతున్నాడని తాజాగా అందుతున్న సమాచారం.1980 లో రాయలసీమలో జరిగిన ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించ బోతున్నాడని టాక్ నడుస్తుంది.ఈ రియల్ స్టోరీ మీదేగోపీచంద్ ఒక స్క్రిప్ట్ రెడీ చేసాడని టాక్ నడుస్తుంది.ఇది నిజమో కాదో తెలియాలంటే మరొకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వం లోఅఖండ సినిమా చేస్తున్నాడు.బోయపాటి, బాలయ్య సినిమా అంటే ముందే అంచనాలు పెరిగాయి.ఇంకా విడుదలైన టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ సయేశా సైగల్హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకుథమన్ సంగీతం అందిస్తున్నారు.
విలన్ రోల్ లో కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం.బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ కూడా వాయిదా పడింది.ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.