నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ రిలీజ్ అవడంపై జరిగిన రచ్చ అందరికి తెలిసిందే.ఎగ్జిబిటర్లు నాని సినిమాపై ప్రెస్ మీట్ పెట్టి మరి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు.
అయితే వారు పెట్టిన ప్రెస్ మీట్ టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్ డేట్ మార్చమనే సంగతి తెలిసిందే.ఇదిలాఉంటే నాని టక్ జగదీష్ సినిమాకు పోటీగా గోపీచంద్ సీటీమార్ థియేటర్లో రిలీజ్ అవుతుంది.
చాలా చోట్ల ఇంకా కొన్ని థియేటర్లు తెరచుకోలేని పరిస్థితి ఉన్నా సరే గోపీచంద్ సీటీమార్ థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని టక్ జగదీష్ పై ఇన్ డైరెక్ట్ గా స్పందించారు హీరో గోపీచంద్.
ప్రతి నిర్మాత తన సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయాలనే తీస్తాడని.కాని ఇప్పుడు పరిస్థితి బాగాలేక కొన్ని సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్నాయని.
నిర్మాత బయట తెచ్చిన ఫైనాన్స్ వడ్డీలు భరించలేక కొందరు ఇలా చేస్తారని.అది వారి స్థానం నుండి మనం ఆలోచించాలని.
సినిమాలు ఓటీటీ రిలీజ్ చేయడం తప్పేమి కాదని చెప్పారు గోపీచంద్.అంటే నాని సినిమా డిజిటల్ రిలీజ్ పై గోపీచంద్ సపోర్ట్ గా మాట్లాడారనే చెప్పొచ్చు.