బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘డిక్టేటర్’ ఆడియోను వచ్చే నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సినిమా వేడుకలు జరగడం మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి.
తాజాగా బాలయ్య ‘డిక్టేటర్’ విడుదల వార్తలు రాగానే గోపీచంద్ నటిస్తున్న ‘సౌఖ్యం’ ఆడియోను కూడా ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రంతో సక్సెస్ను దక్కించుకున్న కెఎస్.
రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ మరియు రెజీనా జంటగా తెరకెక్కిన చిత్రం ‘సౌఖ్యం’.సక్సెస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియోను ఆంధ్రద్రేశ్లోని ఒంగోలులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.వచ్చే నెల 13న ఒంగోలులో భారీగా ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా వారు చెప్పుకొచ్చారు.
అయితే ఒంగోలులో ఈ సినిమా ఆడియోను ఎందుకు విడుదల చేస్తున్నారు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.తమ ప్రాంతంలో ఆడియో విడుదల అవ్వబోతుండటంతో ఒంగోలు ప్రేక్షకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
క్రిస్మస్ కానుకగా వచ్చే నెల చివరి వారంలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.