మ్యాచో స్టార్ గోపిచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఈయన హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.
ప్రెసెంట్ గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో సీటిమార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమా నుండి వచ్చిన అన్ని పోస్టర్స్, టీజర్, పాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో మరిన్ని ప్రమోషన్స్ చేస్తూ జనాల్లోకి తీసుకు వెళ్లాలని చిత్ర యూనిట్ బాగానే కష్టపడుతుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్ మాట్లాడుతూ చాలా విషయాలను తెలిపారు.
ఈ సినిమా 50 శాతం పూర్తి అయిన తర్వాత కరోనా కారణంగా వాయిదా పడింది.
దాదాపు 9 నెలల తర్వాత ఈ సినిమా మళ్ళీ రీస్టార్ట్ చేసి పూర్తి చేసాము.ఇక పూర్తి అయిన తర్వాత రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్న సమయంలోనే మళ్ళీ సెకండ్ వేవ్ రావడం వల్ల మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది.కరోనా కారణంగా సినిమా ఇండస్ర్టీపై చాలా ప్రభావం పడింది.
ఇప్పుడిప్పుడే అన్ని పరిస్థితులు చక్కబడుతున్నాయి.అందుకే సీటిమార్ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయడానికి రెడీ అయ్యాం.
ఇక ఈ సినిమా తప్పకుండ ప్రేక్షకులను అలరిస్తుందని గట్టి నమ్మకం ఉంది.అందరిని థియేటర్స్ కు లాక్కొచ్చే సత్తా ఈ సినిమాకు ఉంది అని గోపీచంద్ తెలిపారు.మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని సినిమాలు రావడానికి మొగ్గు చూపుతాయి.ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ సినిమాను తెరకెక్కించడంలో ఈ సినిమా ఎవ్వరిని డిజప్పాయింట్ చేయదు అని గోపీచంద్ తెలిపారు.
చూడాలి మరి ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో.