గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డి నేపథ్యంలో రూపొందిన సిటీమార్ సినిమా విడుదల ఇటీవలే వాయిదా పడింది.ఏప్రిల్ 2న ఈ సినిమాను విడుదల చేయాలని మొదటి నుండి భావించారు.
కాని వైల్డ్ డాగ్ సినిమా తో పోటీ వద్దనుకోవడంతో పాటు అనుకున్నట్లుగా వీఎఫ్ఎక్స్ వర్క్ కాకపోవడం వల్ల సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయబోవడం లేదు అంటూ ప్రకటించారు.ఇతర సినిమాలకు పోటీ లేకుండా రావడం అనేది రాబోయే కాలంలో కష్టంగా మారింది.
ప్రతి వారం చిన్నదో పెద్దదో ఏదో ఒక సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ఇలాంటి సమయంలో సిటీమార్ సినిమా ను సోలోగా విడుదల చేయడం సాధ్యమేనా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా సినిమా ను ఏప్రిల్ 30వ తారీకు న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
రానా నటించిన విరాట పర్వం ఆ రోజున విడుదల కాబోతుంది.వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాట పర్వం సినిమా లో సాయి పల్లవి ఉండటం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే విడుదల అయిన టీజర్ సినిమా పై అంచనాలు ఆకాశానికి తీసుకు వెళ్లాయి.అద్బుతమైన ఉద్యమ నేపథ్యం అవ్వడం వల్ల సినిమా కు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది అనేది క్లారిటీగా చెప్పలేం.
అందుకే ఈ సినిమా కూడా అదే రోజు వస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందని దర్శకుడు సంపత్ నంది భావించి ఉంటాడు అనిపిస్తుంది.ఏది ఏమైనా ఈసారి మాత్రం సిటీమార్ సినిమాను అనుకున్నట్లుగా ఏప్రిల్ 30న విడుదల చేయడం ఖాయం గా తెలుస్తోంది.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలోనే వీఎఫ్ ఎక్స్ వర్క్ ను కూడా పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.