మాస్ హీరో గోపీచంద్, రాశి ఖన్నా హీరోయిన్ గా కమర్షియల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
హీరో గోపీచంద్ కు ఈ సినిమా హిట్ అనేది అత్యంత కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.హీరోయిన్ రాశి ఖన్నా కూడా చిన్నా చితక సినిమా ల్లో నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా హిట్ అయితే పెద్ద సినిమా ల్లో ఆఫర్ వస్తుందని ఆశ పడుతోంది.
ఇక మారుతి ఈ సినిమా సక్సెస్ చేసుకుంటే ప్రభాస్ తో వెంటనే రాజా డీలక్స్ సినిమా ను పట్టాలెక్కించవచ్చు.అలాగే మారుతి కి చిరంజీవి నుండి కూడా ఆఫర్ ఎదురు చూస్తుంది.
కనుక ఖచ్చితంగా పక్కా కమర్షియల్ సినిమా అనేది సక్సెస్ అవ్వాల్సిందే.మరి సినిమా ఎలా ఉంటుంది అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
హీరోయిన్ గా రాశిఖన్నా ఈ సినిమా లో వినోదాన్ని పండించే తీరు అందరిని ఆకట్టుకుంటుందని మారుతి అంటున్నాడు.మారుతి గతంలో తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమా ను మించి ఈ సినిమా ఉంటుంది అనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మారుతి సన్నిహితులు ఉన్నారు.పక్కా కమర్షియల్ సినిమా కు సాలిడ్ బిజినెస్ అయితే జరిగింది.
ఇప్పుడు ఆ మొత్తం ను రికవరీ చేసేందుకు ఖచ్చితంగా కాస్త ఎక్కువ సమయం పడుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.అయితే సినిమాకు మంచి టాక్ వస్తే ఆ మొత్తం సాధించడం పెద్ద కష్టం ఏమీ కాదు అనేది ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్ వర్గాల వారి మాట.
ఈ సినిమా ను బన్నీ వాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పించాడు.