ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా ఎలాంటి పరిస్థితులు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం.దీని ప్రభావానికి చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు.
కాగా ఉన్న వారికి చాలా రోజులుగా కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నాయి.దీంతో చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇబ్బందులు పడుతున్నారు.
ఆఫీసులో చేయాల్సిన వర్క్ కంటే కూడా ఇంటి దగ్గర ఎక్కువగా చేస్తున్నామంటూ వాపోతున్నారు.ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 3 లక్షల 80 మంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ను వద్దని బలంగా చెప్తున్నారు.
కాగా ఇంటి దగ్గర నుంచి చేయడం కంటే కూడా ఆఫీసుకు వెళ్లి పనిచేస్తేనే బెటర్ అన్నట్టు చెప్తున్నారు.ఇక మన దగ్గర కూడా 2.4 లక్షల మంది వరకు సాఫ్ట్ వేర్ జాబర్లు ఇళ్ల దగ్గరి నంఉచి పనులు చేయడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు.కాగా మన దగ్గర కూడా చాలామంది ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఆఫీసులకు వెళుతున్నారు.
ఇప్పుడు చాలా వరకు మన దేశంలో కూడా కరోనా కేసులు తగ్గడంతో చాలా కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం నిర్వహించడంపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
అయితే ప్రపంచంలోనే ఇప్పుడు నంబర్ వన్ సెర్చింజన్ అయిన పరిచయం అక్కర్లేని గూగుల్ సంస్థ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీద స్పందించింది.ఇప్పటికే తమ కంపెనీలో ఈ వర్క్ ఫ్రం హోం స్టార్ట్ అయి ఏడాది దాటుతుండగా ఆఫీసులకు రమ్మనే విషయంలో వెనక్కి కాస్త తగ్గింది గూగుల్.డెల్టా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో వచ్చే 2022 జనవరి వరకు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉంటుందని సంచలన ప్రటకన చేసింది అయితే ఈ గడువు ముగిసిన తర్వాత నిర్ణయించిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ప్రకటించారు.
.