కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఇళ్లకే పరిమితం అయ్యారు.ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు కూడా చేయలేని పరిస్థితి ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు.
దాదాపు ఏడాదిన్నర పాటు ఇలాగే ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేసారు.ఇప్పుడు కరోనా వైరస్ తగ్గుముఖం పడడంతో ఆఫీస్ లకు వచ్చి వర్క్ చేయమని కంపనీ అధినేతలు చెప్పడంతో ఉద్యోగులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టని కారణం చేత ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి పని చేయాలంటే అంతా ఆసక్తి కనబరచడం లేదు.ఈ క్రమంలోనే ఇప్పుడు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగులు ఇంట్లో ఉండి పనిచేయాలా లేక ఆఫీసుకు వచ్చి వర్క్ చేయాలా అనే విషయం పట్ల క్లారిటీ ఇచ్చింది.
ఈ రెండికి మధ్య ఒక నూతన విధానాన్ని అమలులోకి తేవాలని గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.
ఒక విధంగా గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తారనే చెప్పాలి.ఈ క్రమంలోనే ఉద్యోగులకు ” ఫ్లెక్సిబుల్ వర్క్ వీక్ ” అనే నూతన విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది.మరి ఈ రకమైన మెథడ్ గురించి ఉద్యోగులు ఏమంటారో అనేది వేచి చూడాలి.