గత కొన్ని నెలల నుండి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా లాక్ డౌన్ వల్ల ప్రపంచంలో ఆర్థికంగా, వాణిజ్య పరంగా సమస్యలు ఎదురయ్యాయి.
అంతేకాకుండా దేశంలో ఎన్నో ఎగుమతి, దిగుమతి వస్తువుల సరఫరా కూడా తగ్గుతూ వచ్చాయి.దీని వల్ల దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది.
పరిశ్రమల లో, ఇతర ఉద్యోగ రంగాల్లో ఆర్థికంగా నష్టపోయినందున ఉద్యోగులకు సరిగ్గా వేతనాలు అందక వలస కూలీలుగా మారారు.
ఇది ఇలా ఉండగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.
ఆర్థికపరంగా నష్టాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలు.తమ ఉద్యోగులందరికి జీతాలు పెంచుతున్నట్లు టీసీ ఎస్ తెలిపింది.
కంపెనీకి సంబంధించిన అన్ని రకాల రంగాలవారికి జీతం పెంచుతున్నట్లు తెలిపారు.కరోనా విజృంభించక ముందు గతంలో ఇచ్చిన వేతనాలను ప్రస్తుతం అదే పద్ధతిలో అందించనుంది.
ఈ విధంగా వేతనం అందించడంతో పాటు ప్రతి ఒక్క రంగం లో జీతము ను పెంచుతున్నట్లు టీసీఎస్ అధికారి వెల్లడించారు.
ఈ విధంగా కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో గతంలో ఆర్థిక పరంగా నష్టపోయినందున… కొన్ని నెలల నుండి వర్క్ ఫ్రం హోం అనే నిబంధనతో పనులు సాగాయి.
ఈ విధంగా ఆర్థికపరంగా దెబ్బతిన్న సంస్థలు జీతాల పెంపును, ప్రమోషన్లు నిలిపి వేయగా కొన్ని కంపెనీలు ఏకంగా ఉద్యోగులను తొలగించారు.ప్రస్తుతం ఐటి ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.
అంతేకాదు మన దేశంలోని, అమెరికాలోని వేలకు పైగా ట్రైనీల ను తీసుకోనుందట.కొన్ని రంగాలలో ఉన్న వేతనాలను తక్కువ చేసి ఇవ్వగా ఈ విధంగా ఐటీ కంపెనీలను ఉద్దేశించి మరికొన్ని రంగాల లో సరైన వేతనాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయా లేదా అనేది చూడాలి.