ప్రముఖ ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందిస్తోంది.ఈ నెల 22వ తేదీన జరిగే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేషోత్సవ్ సేల్ ని ప్రారంభించింది.
ఈ ఆఫర్ ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతుందని సంస్థ వెల్లడించింది.వినియోగదారులకు సౌకర్యంగా ఈఎంఐ ఆఫర్లతో పాటు క్యాష్ బ్యాక్ ను కూడా అందించనుంది.
శాంసంగ్ ప్రొడక్ట్స్ అయిన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, స్మార్ట్ ఓవెన్లు, ఏసీలు, క్యూలెడ్ టీవీలు, స్మార్ట్ టీవీలపై తగ్గింపు ధరలతో పాటు ఆఫర్లను అందిస్తోంది.
శాంసంగ్ ప్రొడక్ట్స్ కొనుగోలుపై ఆఫర్లు ఈ క్రింది విధంగా ప్రకటించారు.
శాంసంగ్ క్యూలెడ్ 8కే టీవీని కొనుగోలు చేసిన వారికి గెలాక్సీ ఎస్20 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఉచితంగా అందించనుంది.ఈ ప్రొడక్ట్ కు పదేళ్ల వరకు నో స్క్రీన్ బర్న్ ఇన్ వారంటీని కూడా అందిస్తోంది.అలాగే 43 ఇంచుల కంటే పెద్దగా ఉన్న స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ సదుపాయం కల్పించింది.దీంతో పాటుగా నెలకు రూ.990తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్ ను అందించింది.
రిఫ్రిజిరేటర్లపై కూడా భారీ ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ స్పేస్ మ్యాక్స్ ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసిన వారికి గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా అందించనుంది.ఫ్రిజ్ కొనుగోలుపై 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.రూ.990 ఈఎంఐ సదుపాయం ఏర్పాటు చేసింది.అలాగే ఏసీలపై 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్, కండెన్సర్, పీసీబీ కంట్రోలర్ పై 5 ఏళ్ల వారంటీ, డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ లపై 10 ఏళ్ల వారంటీని కల్పించింది.
దీంతో పాటు 28 లీటర్ల కెపాసిటీ ఉన్న స్మార్ట్ ఓవెన్లను కొనుగోలు చేస్తే బోరోవెల్ కిట్ ను ఉచితంగా అందించనుంది.