ఎన్నికల పుణ్యమా అంటూ ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది.చాలా కాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది.
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్ని ప్రకటించింది.మొత్తం 9,270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.‘ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్ని విడుదల చేస్తాము.నవంబర్ 30న పరీక్ష నిర్వహించి.వచ్చే ఏడాది జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.ఈ రోజు జరిగే కేబినేట్ మీటింగ్లో పీఈటీ పోస్టుల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించి తుది ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు.