ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయింది.అగ్రవర్ణాల లో వారి గా ఉండే వారి కోసం పది శాతం రిజర్వేషన్లు కల్పించడానికి జగన్ ప్రభుత్వం సిద్ధం అయ్యి.బుధవారం రాత్రి (జీవో ఎంఎస్ నెం.66 2021) ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.దీంతో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించనుంది.సీట్లలో మూడవ వంతు ఈడబ్ల్యూఎస్ కోటా కింద దాదాపు 10 శాతం రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలకు వర్తించనుంది.
వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు వర్తించేలా జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.2019 వ సంవత్సరంలో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది.ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు తదితర కులాల లో ఉండే ప్రజలకు మేలు జరిగే అవకాశం కల్పించేలా తాజాగా జగన్ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది.జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో అగ్రవర్ణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.