కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మొన్నటివరకు పర్యాటక ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఆపేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ పర్యాటక ప్రేమికులకు స్పెషల్ ప్యాకేజీ అందిస్తోంది.
సందర్శకులను ఆకర్షించడానికి పర్యాటకశాఖ స్పెషల్ ప్యాకేజీ ప్రవేశపెట్టింది.ఖచ్చితంగా సందర్శకులు కరోనా నిబంధనలు పాటించాలి అన్న షరతు విధించింది.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో సుందర ప్రదేశాలతో పాటు ప్రకృతి జలపాతాలకి పుణ్యక్షేత్రాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.పర్యాటక అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ హైదరాబాదు నుండి 28 ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.
సందర్శకులను ఆకర్షించడానికి వారి కాలనీలు అపార్ట్మెంట్ ల వద్దకే టూరిజం బస్సులు పంపిస్తుంది.కృష్ణా నది బోటు విహారం ఇంక శ్రీశైలం అదే రీతిలో నాగార్జునసాగర్ వంటి పర్యాటక ప్రాంతాలకు బస్సులు మినీ వ్యాన్ ల ప్రభుత్వమే అందించే రీతిలో స్పెషల్ ప్యాకేజీ లు పర్యాటకులకు ఇస్తూ వస్తోంది.