రోహిత్ శర్మ అంటే ఎవరో తెలియని క్రికెట్ అభిమానులు ఉండనే వుండరు.టీమిండియా జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ 3 ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
దాంతో రోహిత్ పేరు క్రికెట్ మైదానంలో మారుమోగిపోయింది.రోహిత శర్మ బంసొద్, నాగ్పూర్, మహారాష్ట్రలో ఏప్రిల్ 1987 30 న జన్మించాడు.
అమ్మ పేరు పూర్ణిమా శర్మ.వీరిది బేసిగ్గా విశాఖపట్టణం.
అతని తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్ లో కేర్ టేకర్ గా పనిచేసేవాడు.
రోహిత్ శర్మ గ్వాలియర్ వద్ద మార్చి 2005 లో దేవధర్ ట్రోఫీ సెంట్రల్ జోన్ కు వ్యతిరేకంగా వెస్ట్ జోన్ తరుపున రంగప్రవేశం చేసిన సంగతి విదితమే.
అదే టోర్నమెంట్లో ఉదయపూర్ వద్ద ఉత్తర జోన్ కు వ్యతిరేకంగా 123 లో 142 బంతుల్లో బాది అజేయంగా ఇన్నింగ్స్ ని ఒడ్డుకి చేర్చాడు.దాంతో అతని పేరు వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రదర్శన, అబూ ధాబీ, ఆస్ట్రేలియాలో భారతదేశం మ్యాచుల ప్రదర్శన, ఛాంపియన్స్ ట్రోఫీకి 30 మంది సభ్యుల జాబితాలో రోహిత్ కి చోటు దక్కేలా చేసింది.ఇది సరిగ్గా తన రంజీ ట్రోఫీలో రంగప్రవేశం చేసే ముందు జరిగిన సంఘటనలు.
ఇలా రోహిత్ ఎంతో శ్రమకోర్చి టీమ్ ఇండియాలో చేరాడు.
ఇకపోతే, లీసెస్టర్షైర్తో జరిగిన 4 రోజుల వార్మప్ గేమ్ అనంతరం రోహిత్కు కరోనా పాజిటివ్ రావడంతో ఇంగ్లాండ్ 5వ టెస్ట్కు రోహిత్ దూరమయిన సంగతి తెలిసినదే.అప్పటి నుంచి రోహిత్ ఐసోలేషన్లో ఉన్నారు.ప్రస్తుతం అతనికి కరోనా నెగిటివ్ రావడంతో జులై 7న ఇంగ్లాండ్తో జరగనున్న టీ20 మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడు.
దీంతో రోహిత్ ఈ రోజు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.