ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రైళ్లన్నీ నిలిచిపోయాయి.
అయితే అన్ లాక్ ప్రక్రియ కొనసాగడంతో రైల్వేశాఖ కొన్ని సర్వీసులను మాత్రమే నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే కేంద్రం అన్ లాక్-4 ప్రక్రియ ప్రారంభించడంతో రైల్వేశాఖ కొన్ని రైల్వే సర్వీసులను ప్రారంభించనుంది.
సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 80 నుంచి 40 టూ అండ్ ప్రో సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
రైల్వే సర్వీసులు ప్రారంభం కానున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.‘‘అన్ లాక్ ప్రక్రియ కొనసాగడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
కొన్ని రైల్వే సర్వీసులను స్టార్ట్ చేయాలని భావిస్తోంది.దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
కరోనా కష్టకాలంలో కూడా కొన్ని సర్వీసులు మాత్రమే కొనసాగుతున్నాయి.కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రైల్వేలు నడుపుతున్నాం.
ఇప్పుడు దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.’’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే కరోనా సమయంలో రైల్వే మంత్రిత్వ శాఖ శ్రామిక్ స్పెషల్ రైలు సర్వీసులను, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించింది.