ఇటీవల పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం తర్వాత పవన్ వ్యక్తిగత సిబ్బంది ఒక్కొక్కరు కరోనా బారిన పడటంతో వెంటనే పవన్ ముందు జాగ్రత్తగాసెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.
ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పవన్ కి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావటం జరిగింది.ఈ వార్త అధికారికంగా పవన్ టీం తెలపడంతో అభిమానులు మరియు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు రాజకీయ నేతలు పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
డై హార్ట్ ఫాన్స్ ఏకంగా భగవంతునికి ప్రార్థనలు చేస్తూ రకరకాలుగా తమ అభిమానాన్ని చాటుకునే విధంగా వ్యవహరించారు.ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ కి మరోసారి కారణం నిర్ధారణ పరీక్షలు ఫాంహౌస్ లో చేయగాకరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగిందట.
దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో రావడంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి అప్పట్లో పవన్ కి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయటం జరిగింది.
దీంతో పాజిటివ్ రిపోర్ట్ రావడం వెంటనే పవన్ ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుని తాజాగా మహమ్మారిని జయించారట.ఈ వార్త తెలుసుకుని పవన్ అభిమానులు నెట్టింట్లో ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు.