కరోనా మనదేశంలో అనేక నష్టాలను కలిగించింది.చాలా సంస్థలు తీవ్ర నష్టాలను పొందాయి.
లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇంటికే పరిమితం అవ్వడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులనేవి తలెత్తాయి.అయితే ఇటువంటి సమయంలో కూడా మద్యం అమ్మకాలు సజావుగానే సాగాయి.
చాలామంది మద్యం కోసం క్యూ కట్టిన సందర్భాలున్నాయి.మద్యం దొరక్క ప్రాణాలొదిలిన ఘటనలు ఎన్నో లాక్ డౌన్ లో చోటుచేసుకున్నాయి.
అందుకే ఆయా ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను మాత్రం నిలపడం లేదు.చాలా మంది ప్రభుత్వాలకు తన గోడును విన్నవించుకున్నారు.
మద్యం అమ్మకాలు ఆపవద్దని బతిమలాడుకున్నారు.అందుకే కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలను ఆన్ లైన్ లో కూడా జరిపారు.
తాజాగా మరో రాష్ట్రం కూడా ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలను జరిపేందుకు సిద్దమయ్యింది.ఆన్లైన్ లో మద్యం అమ్మేందుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపడంతో ఆన్ లైన్ అమ్మకాలు షురూ అయ్యాయి.
గువాహటిలో కేబినెట్ సమావేశం జరిగింది.అందులో ప్రయోగాత్మకంగా ఓ నెల రోజుల పాటు ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.బుధవారం అస్సాం మంత్రి పీజుష్ హజారిక ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు.గువాహటిలో నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ లో మద్యాన్ని అమ్ముతున్నట్లు అస్సాం కేబినెట్ నిర్ణయించింది.
ఇది కనుక విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని సర్కార్ తెలిపింది.ఈ మేరకు సీఎం హిమంత విశ్వ శర్మ ట్విట్టర్ లో ఓ పోస్టు ను పెట్టాడు.అస్సాం కేబినెట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు రిలీఫ్ అందించడంతో పాటు విద్యను వృద్ధి చేయాలనుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు.
మద్యం అమ్మకాలు ఆన్ లైన్ నిర్వహించడం పట్ల మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.