ఇండియన్ టెక్కిలకు యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తీపి కబురు అందించింది.2023-24 హెచ్1బీ వీసాల కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్ను మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపింది.ఈ రిజిస్ట్రేషన్ల సమయం ఈ ఏడాది మార్చి 17 వరకు కొనసాగుతుంది.ఈ సమయంలో దరఖాస్తుదారులు ఆన్లైన్ H-1B రిజిస్ట్రేషన్ సిస్టమ్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్లను పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
కాగా మార్చి 31వ తేదీ నాటికి వీసా హోల్డర్ల పేర్లను యూఎస్ ప్రభుత్వం ప్రకటించనుంది.
యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ఫిబ్రవరి 21న H-1B వీసాల కోసం 10 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజులను తీసుకోవడం ప్రారంభిస్తుంది.తగినంత రిజిస్ట్రేషన్లు వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ కొన్నింటిని ఎంచుకుని మార్చి 31 నాటికి నోటిఫికేషన్లను పంపిస్తుంది.H-1B వీసాలు టాలెంటెడ్ టెక్ వర్కర్స్ను యూఎస్కి తీసుకురావడానికి అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు ఉపయోగిస్తాయి.ఈ వీసాలు ఎక్కువగా చైనీయులు, భారతీయులకే అందుతున్నాయి.
సాంకేతికత, ఇంజనీరింగ్, వైద్యం వంటి ప్రత్యేక రంగాలలో యూఎస్లో ఆరు సంవత్సరాల వరకు పని చేయడానికి జీవించడానికి H-1B వీసాలు అనుమతిస్తాయి.ఆరు సంవత్సరాల తర్వాత, ఇది శాశ్వత నివాసం లేదా గ్రీన్ కార్డ్కు మార్గాలను తెరుస్తుంది.కాగా యూఎస్లో ఇటీవల టెక్ తొలగింపులు ఈ సంవత్సరం H-1B వీసాల డిమాండ్ను ప్రభావితం చేస్తాయో లేదో తెలియాల్సి ఉంది.
బాగా ప్రతిభ ఉండి ఇండియాలో జాబ్ దొరకకపోతే అమెరికన్ కంపెనీల్లో జాబు పొందడం అలాగే అక్కడ జీవితం కొనసాగించడం ఈ వీసా తో సాధ్యమవుతుంది.
.