యూఏఈ లో ఉంటున్న ఎంతో మంది భారతీయులకి గుడ్ న్యూస్ ఆక్కడి ప్రభుత్వం ఇకపై వలసదారుల కుటుంభాలు తమ దేశానికి ఎంతో సౌకర్యంగా రావచ్చని అందుకు తగ్గట్టుగా ఎక్స్పాట్ వీసాలో అనేక మార్పులు చేసినట్టు అక్కడి అధికారులు తెలిపారు.ఈ మార్పులతో నైపుణ్యం కలిగిన ఎంతో మంది ప్రతిభావంతులు తమ దేశానికి వస్తారని భావిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
ప్రతీ వ్యక్తీ తమ కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా రోజూ గడపాలని కోరుకుంటారు అందుకే తాము ఈ ప్రతిపాదన తీసుకువచ్చాము అంటున్నారు అధికారులు.కుటుంబసభ్యులు పక్కనే ఉంటే వలసదారులు మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారని అధికారులు పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం పెట్టిన తాజా ప్రతిపాదనతో ఎంతో మంది ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఈ వీసాను పొందాలంటే వలసదారులకు తగిన ఆదాయం ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు